మనామాలో కార్ల ధ్వంసం
- January 26, 2016
సుమారు 50కి పైగా కార్లు మనామా గేట్ ప్రాంతంలో ధ్వంసం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆగంతకులు ఈ దాడులకు పాల్పడినట్లు తెలియవస్తున్నది. ఎక్కువగా వలసదారుల కార్లపైనే ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడులకు సంబంధించి 20కి పైగా ఫిర్యాదులు పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. తెల్లవారు ఝామున 3 గంల సమయంలో ఈ ఘటన జరిగింది. ఉదయం 3.30 నిమిషాల సమయంలో తాను లేచి చూడగా, కార్లు ధ్వంసమయి ఉన్నాయని రణిజిత్ పోడి అనే వ్యక్తి చెప్పారు. ఓ వ్యక్తి ఈ దాడులకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తిని యువకుడిగా గుర్తించినట్లు చెప్పారు ప్రత్యక్ష సాక్షులు. అయితే ఆ యువకుడు ఎవరన్నది తెలియరాలేదు. అద్దాలను పదునైన ఆయుధంతో పగలగొట్టారనీ, అలాగే వైపర్ బ్లేడ్స్ని తొలగించేందుకు ప్రయత్నించారని వాహనదారులు రిపోర్ట్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







