ఏపీలో 226కు చేరిన కరోనా కేసుల సంఖ్య

- April 05, 2020 , by Maagulf
ఏపీలో 226కు చేరిన  కరోనా కేసుల సంఖ్య

ఏపీలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.. రాష్ట్రంలో నిన్న రాత్రి 9:00 నుంచి ఇవాళ ఉదయం 9 వరకు నమోదైన కోవిడ్ పరీక్షల్లో కొత్తగా ఒంగోలు లో 2, చిత్తూరు లో 7, కర్నూల్ లో 23, నెల్లూరు లో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కొత్తగా నమోదైన 34 కేసుల తో కలిపి రాష్ట్రం లో COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 226 కి పెరిగింది. ఇక జిల్లా వారీగా చూసుకుంటే.. విశాఖపట్నం 15, తూర్పు గోదావరి 11, పశ్చిమ గోదావరి 15, కృష్ణా 28, గుంటూరు 30, ప్రకాశం 23, నెల్లూరు 34, కడప 23, కర్నూలు 27, చిత్తూరు 17, అనంతపురం 3 గా నమోదయ్యాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 32 కేసులు నమోదయితే ఆ తరువాత గుంటూరు రెండో స్థానంలో నిలిచింది. ఇక శ్రీకాకుళం , విజయనగరం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com