అమెరికా లో 10 వేలకు చేరువలో కరోనా మృతులు
- April 06, 2020
అమెరికా:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుక్షణం ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు. కరోనా మృతుల సంఖ్య 10వేలకు చేరుకోబోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు 16 లక్షల మంది వైరస్ నిర్థారణ పరీక్షలు జరిగినట్లు ఆయన తెలిపారు. ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని, సామాజిక దూరం పాటించాలని ఆయన మరోసారి గుర్తు చేశారు. 9/11 ఉగ్రదాడిని మించి కరోనా మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఒక్కరోజే 1,188 మంది కరోనా కారణంగా మరణించారు. కొత్తగా మరో 23 వేల మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. వైద్య పరికరాలను, రక్షణ సాధనాలను తెప్పించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపారు. అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో ఈ సంక్షోభాన్ని భారీ విపత్తుగా ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు