కోవిడ్‌ 19: మూడో టెర్మ్‌ స్కూల్‌ ఫీజులో 20 శాతం రాయితీ

- April 09, 2020 , by Maagulf
కోవిడ్‌ 19: మూడో టెర్మ్‌ స్కూల్‌ ఫీజులో 20 శాతం రాయితీ

యూఏఈ: ఇన్నోవెంచర్స్‌ ఎడ్యుకేషన్‌ గ్రూప్‌, తమ విద్యార్థులకు మూడో టెర్మ్‌ ఫీజు నుంచి 20 శాతం మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్‌ కారణంగా తలెత్తిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తల్లిదండ్రులకు ఇది పెద్ద ఊరటగా వుంటుందని సదరు ఎడ్యుకేషన్‌ గ్రూప్‌ పేర్కొంది. ఏప్రిల్‌ - జూన్‌ 2020 పీరియడ్‌కిగాను ఈ డిస్కౌంట్‌ వర్తించనుంది. ఇన్నోవెంచర్స్‌ ఎడ్యుకేషన్‌ సిఇఓ పూనవ్‌ు భోజాని మాట్లాడుతూ, ఇప్పటికే చెల్లించిన విద్యార్థులకు మూడో టెర్మ్‌ ఫీజులో 10 శాతం రిఫండ్‌ ఇవ్వబడుతుందని చెప్పారు. కాగా, సేలరీ కట్స్‌, ఉద్యోగాలు కోల్పోవడం వంటి కారణాలతో ఇబ్బందులు పడుతున్నవారికి పర్సనలైజ్డ్‌ పేమెంట్‌ ప్లాన్స్‌ని గతంలోనే ఈ గ్రూప్‌ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com