కువైట్:వాలంటీర్లుగా ప్రైవేట్ వైద్య సిబ్బంది సేవల వినియోగానికి అనుమతి
- April 10, 2020
కువైట్:కరోనా పేషెంట్లకు చికిత్స అందించేందుకు ప్రైవేట్ రంగంలోని వైద్య సిబ్బంది సేవలను వినిగియోంచుకునేందుకు కువైట్ ఆరోగ్య శాఖ సిద్ధమైంది. వాలంటీర్లుగా డాక్టర్లు, నర్సులు సేవలు అందించాలని కోరింది. కరోనా వైరస్ పై పోరాటంలో ప్రభుత్వం చేస్తున్న కృషిలో తమ బాధ్యతగా భాగస్వామ్యం కావాలనుకునే డాక్టర్లు, నర్సులు ఏప్రిల్ 12 నుంచి తమ పేర్లను నమోదు చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కోగలమని విశ్వాసం వ్యక్తం చేసింది. వైద్య సాయం అందించాలనుకునే డాక్టర్లు అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ టెక్నికల్ అఫైర్స్ ఆఫీసులో అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే నర్సులు అయితే అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ మెడికల్ సర్వీసెస్ లో దరఖాస్తు చేయాలి. ఏప్రిల్ 12 నుంచి మూడు రోజుల పాటు ధరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ తో పాటు ప్రాక్టిసింగ్ లైసెన్స్, సివిల్ ఐడీ కార్డు, వారు పని చేసే కంపెనీ నుంచి అనుమతి లేటర్ ను జత చేయాల్సి ఉంటుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







