కువైట్:వాలంటీర్లుగా ప్రైవేట్ వైద్య సిబ్బంది సేవల వినియోగానికి అనుమతి
- April 10, 2020
కువైట్:కరోనా పేషెంట్లకు చికిత్స అందించేందుకు ప్రైవేట్ రంగంలోని వైద్య సిబ్బంది సేవలను వినిగియోంచుకునేందుకు కువైట్ ఆరోగ్య శాఖ సిద్ధమైంది. వాలంటీర్లుగా డాక్టర్లు, నర్సులు సేవలు అందించాలని కోరింది. కరోనా వైరస్ పై పోరాటంలో ప్రభుత్వం చేస్తున్న కృషిలో తమ బాధ్యతగా భాగస్వామ్యం కావాలనుకునే డాక్టర్లు, నర్సులు ఏప్రిల్ 12 నుంచి తమ పేర్లను నమోదు చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కోగలమని విశ్వాసం వ్యక్తం చేసింది. వైద్య సాయం అందించాలనుకునే డాక్టర్లు అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ టెక్నికల్ అఫైర్స్ ఆఫీసులో అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే నర్సులు అయితే అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ మెడికల్ సర్వీసెస్ లో దరఖాస్తు చేయాలి. ఏప్రిల్ 12 నుంచి మూడు రోజుల పాటు ధరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ తో పాటు ప్రాక్టిసింగ్ లైసెన్స్, సివిల్ ఐడీ కార్డు, వారు పని చేసే కంపెనీ నుంచి అనుమతి లేటర్ ను జత చేయాల్సి ఉంటుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?