యూఏఈ విసిట్/టూరిస్ట్ వీసాల గడువుపై క్లారిటీ ఇచ్చిన అధికారులు
- April 14, 2020
దుబాయ్: కరోనా తో అన్ని దేశాలలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. మరి యూఏఈ కి వివిధ కారణాల వల్ల వచ్చినవారికి వీసాలపై అనేక అనుమానాలు వ్యక్తమతున్నాయి. రెసిడెన్సీ వీసాలపై గడువును 2020 చివరి వరకు పొడిగించారు. అయితే విసిట్/టూరిస్ట్ వీసాపై వచ్చినవారికి పలు సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై అధికారులు ఈరోజు క్లారిటీ ఇచ్చారు.
మీరు యూఏఈ కు విసిట్/టూరిస్ట్ వీసాపై వచ్చినట్టయితే, మీ వీసాలు 2020 చివరి వరకు చెల్లుబాటు అవుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఐతే ఈ నిబంధన కేవలం March 1,2020 తర్వాత గడువు తీరుతున్న వీసాలపై మాత్రమే అని దుబాయ్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) మీడియా సమావేశంలో తెలిపింది.
నివాసితులు/ప్రవాసీయులు తమకు గల ఏదైనా సందేహాలను GDRFA-దుబాయ్ యొక్క 'అమెర్' కాల్ సెంటర్ 8005111 (యూఏఈ లో ఉన్నట్లయితే) లేదా +97143139999 (యూఏఈ వెలుపల ఉన్నట్లయితే) కు కాల్ చేసి నివృత్తిచేసుకోవచ్చు. లేదా [email protected] లేదా [email protected] కు ఇమెయిల్ చేయవచ్చు అని ఈ సందర్భగా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







