యూఏఈ విసిట్/టూరిస్ట్ వీసాల గడువుపై క్లారిటీ ఇచ్చిన అధికారులు
- April 14, 2020
దుబాయ్: కరోనా తో అన్ని దేశాలలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. మరి యూఏఈ కి వివిధ కారణాల వల్ల వచ్చినవారికి వీసాలపై అనేక అనుమానాలు వ్యక్తమతున్నాయి. రెసిడెన్సీ వీసాలపై గడువును 2020 చివరి వరకు పొడిగించారు. అయితే విసిట్/టూరిస్ట్ వీసాపై వచ్చినవారికి పలు సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై అధికారులు ఈరోజు క్లారిటీ ఇచ్చారు.
మీరు యూఏఈ కు విసిట్/టూరిస్ట్ వీసాపై వచ్చినట్టయితే, మీ వీసాలు 2020 చివరి వరకు చెల్లుబాటు అవుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఐతే ఈ నిబంధన కేవలం March 1,2020 తర్వాత గడువు తీరుతున్న వీసాలపై మాత్రమే అని దుబాయ్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) మీడియా సమావేశంలో తెలిపింది.
నివాసితులు/ప్రవాసీయులు తమకు గల ఏదైనా సందేహాలను GDRFA-దుబాయ్ యొక్క 'అమెర్' కాల్ సెంటర్ 8005111 (యూఏఈ లో ఉన్నట్లయితే) లేదా +97143139999 (యూఏఈ వెలుపల ఉన్నట్లయితే) కు కాల్ చేసి నివృత్తిచేసుకోవచ్చు. లేదా [email protected] లేదా [email protected] కు ఇమెయిల్ చేయవచ్చు అని ఈ సందర్భగా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







