దుబాయ్: పాస్పోర్ట్ సేవలను పాక్షికంగా తిరిగి ప్రారంభించిన భారత కాన్సులేట్
- April 14, 2020
దుబాయ్: కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో పాస్పోర్ట్ సేవలను నిలిపివేశారు. దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ ఏప్రిల్ 15 నుంచి బీఎల్ఎస్ షార్జా సెంటర్(King Faisal Street, Sharjah) ద్వారా భారతీయ దరఖాస్తుదారుల పాస్పోర్ట్ సేవలను పాక్షికంగా తిరిగి ప్రారంభించనుంది. ముందుగా ఏప్రిల్ 30, 2020 న లేదా అంతకు ముందే గడువు ముగిసిన/ముగియనున్న పాస్పోర్ట్ల పునరుద్ధరణకు సంబంధించిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలిపిన అధికారులు.
పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు పునరుద్ధరణ కోసం అత్యవసర పరిస్థితుల వివరణతో [email protected] కు ఇమెయిల్ చేయగలరు. దీనిద్వారా షార్జాలోని 'బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ ఎక్స్క్లూజివ్ సెంటర్ ఫర్ ఇండియన్ పాస్పోర్ట్ అండ్ వీసా సర్వీసెస్'లో అపాయింట్మెంట్ ఏర్పాటు చేస్తుంది కాన్సులేట్. దరఖాస్తుదారులు ఆన్లైన్లో పొందుపరిచినా అన్ని పత్రాలను సిద్ధం చేసుకొని మాత్రమే బీఎల్ఎస్ షార్జా సెంటర్ కు వెళ్లాలని ప్రకటించిన అధికారులు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







