కరోనా వైరస్‌పై పుకార్లు: స్పందించిన ప్రభుత్వం

- April 16, 2020 , by Maagulf
కరోనా వైరస్‌పై పుకార్లు: స్పందించిన ప్రభుత్వం

మస్కట్‌: గవర్నమెంట్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌, కోరోనా వైరస్‌ విషయంలో సర్క్యులేట్‌ అవుతున్న పుకార్లని ఎవరూ నమ్మవద్దని సూచించింది. కరోనా వైరస్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారిక వివరాలు వెల్లడిస్తున్నట్లు గవర్నమెంట్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌ పేర్కొంది. మస్కట్‌ బేకరీలో కరోనా వైరస్‌.. అంటూ జరుగుతున్న ప్రచారాన్ని అధికారులు ఖండించారు. ఏప్రిల్‌ 2న ఓ అధికారిక ప్రకటన వచ్చిందనీ, ఆ ప్రకటన ప్రకారం కరోనా నుంచి రికవర్‌ అయినవారి సంఖ్య 57 అంటూ గవర్నమెంట్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌ పాత ప్రకటన వివరాల్ని వెల్లడించింది. పుకార్ల పట్ల ఆకర్షితులవడం మంచిది కాదనీ, అదే సమయంలో ఫేక్‌ న్యూస్‌ని ప్రచారం చేయరాదని అధికారులు హెచ్చరించారు. ‘అధికారిక ప్లాట్‌ఫామ్ ద్వారా వివరాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాం’ అని అధికారులు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com