దుబాయ్:ఆత్మహత్య చేసుకున్న ప్రవాస కార్మికుడికి కరోనా లైదు..క్లారిటీ ఇచ్చిన పోలీసులు
- April 18, 2020
దుబాయ్ పరిధిలోని జెబెల్ అలీ ప్రాంతంలో ఏసియన్ వ్యక్తి ఆత్మహత్యపై జరుగుతున్న ప్రచారాన్ని పోలీసుల కొట్టిపారేశారు. 47 ఏళ్ల ఏసియన్ వ్యక్తి తనకు కరోనా సోకిందని..అందువల్లే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికంగా అపోహలు నెలకొన్నాయి. అయితే..పోలీసులు మాత్రం స్థానికంగా జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. చనిపోయిన వ్యక్తికి వైరస్ సోకలేదని స్పష్టం చేశారు. అయితే..అతను ఏ కారణంతో చనిపోయాడో తెలియాల్సి ఉందని వెల్లడించారు. ఇదిలాఉంటే ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి తన ఫ్లోర్ లోని బాత్రూంలో ముందుగా కాలి నరాలకు కట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత మూడో ఫ్లోర్ నుంచి కిందకు దూకటంతో కింద పార్క్ చేసిన కారుపై పడి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యరాత్రి 12.20 గంటలకు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని సమీపంలోని రషీద్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







