బహ్రెయిన్:ర్యాండమ్ కోవిడ్‌-19 టెస్టింగ్‌

- April 18, 2020 , by Maagulf
బహ్రెయిన్:ర్యాండమ్ కోవిడ్‌-19 టెస్టింగ్‌

బహ్రెయిన్:మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, సిటిజన్స్‌ అలాగే రెసిడెంట్స్‌ని రాండమ్ గా సెలక్ట్‌ చేసి, వారికి కరోనా వైరస్‌ (కోవిడ్‌19) పరీక్షలు నిర్వహిస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ విధానాన్ని కొనసాగిస్తోంది. ప్రతి హౌసింగ్‌ బ్లాక్‌ నుంచి 20 మందిని ఇ-గవర్నమెంట్‌ అథారిటీ సెలక్ట్‌ చేసి, పరీక్షలు నిర్వహిస్తుంది. ఇలా 12 రోజుల పాటు పరీక్షలు జరుగుతాయి. ఆయా వ్యక్తులకు ముందుగానే సమాచారం అందిస్తారు. బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ అండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన టెస్టింగ్‌ ఫెసిలిటీ ద్వారా వైద్య పరీక్షలు జరుగుతాయి. ఐడెంటిఫికేషన్‌ నిమిత్తం చెల్లుబాటయ్యే ఐడీని ఆయా వ్యక్తులు తీసుకురావాల్సి వుంటుంది. 9,000కి పైగా కరోనా వైరస్‌ టెస్టుల్ని ర్యాండమ్ గా నిర్వహించనున్నారు. ఆయా వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఈ పరీక్షల్లో పాల్గొనవచ్చు. అయితే, వారంతా ఒకే వాహనంలో పరీక్షలకు రావాల్సి వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com