3 నెలల అదనపు అబ్సెన్స్‌ పర్మిట్‌

- April 18, 2020 , by Maagulf
3 నెలల అదనపు అబ్సెన్స్‌ పర్మిట్‌

కువైట్:కరోనా వైరస్‌ నేపథ్యంలో మార్చి 1 తర్వాత గడువు తీరే అన్ని రకాల వీసాలకు సంబంధించి 3 నెలల గడువు పొడిగింపు వర్తిస్తుందని మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ఇప్పటికే ప్రకటించింది. మార్చి 1కి ముందు రెసిడెన్సీ గడువు ముగిసినవారికి ఇది వర్తించదు. ఇలాంటివారు క్షమాభిక్ష స్కీవ్‌ుని వినియోగించుకుని, దేశం విడిచి వెళ్ళాల్సి వుంటుంది. చెల్లుబాటయ్యే వీసా వున్నవారు దేశం వెలుపల వున్నా, వారికి ఈ పొడిగింపు వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. రెసిడెన్స్‌ గవువు తీరి, సదరు రెసిడెంట్స్‌ విదేశాల్లో వుంటే, టెంపరరీ వీసా పొందేందుకు తగిన విధంగా అప్లయ్‌ చేసుకోవాల్సి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com