అప్పటి నుంచి విమానాలు నడుస్తాయట!
- April 18, 2020
ఢిల్లీ:కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో విదేశీ విమాన సర్వీసులతో పాటు దేశీయ విమాన సర్వీసులను సైతం గత నెలలోనే కేంద్రం నిలిపేసింది. దీంతో విమాన సర్వీసులు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మే 3వరకు లాక్ డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో... ఆ తరువాతైనా విమాన సర్వీసులు ప్రారంభమవుతాయా లేక ఇందుకు మరింత సమయం పడుతుందా అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే దీనిపై కొంతమేర స్పష్టత ఇచ్చింది ప్రభుత్వరంగ విమాన సంస్థ ఎయిర్ ఇండియా. కొన్ని విమాన సర్వీసులకు సంబంధించిన బుకింగ్స్ మే 4 నుంచి మొదలవుతాయని సంస్థ ప్రకటించింది. ఇక అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించి బుకింగ్స్ను జూన్ 1 నుంచి మొదలవుతాయని స్పష్టం చేసింది. అయితే ఏయే నగరాలకు ముందుగా బుకింగ్స్ మొదలవుతాయనే అంశంపై మాత్రం ఎయిర్ ఇండియా క్లారిటీ ఇవ్వలేదు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







