కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల్లో 63 శాతం వలసదారులే

- April 23, 2020 , by Maagulf
కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల్లో 63 శాతం వలసదారులే

మస్కట్‌: కరోనా వైరస్‌పై పోరాటం కోసం ఏర్పాటయిన సుప్రీం కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల్లో 63 శాతం వలసదారులు కాగా, 37 శాతం ఒమనీయులని తెలుస్తోంది. మొత్తం 1,716 కరోనా పాజిటివ్‌ కేసులు ఇప్పటిదాకా గుర్తించారు. 39 కేసులు హాస్పిటల్స్‌లో వుండగా, అందులో 9 ఐసీయూల్లో వున్నాయి. మొత్తం 6,807 కేసులు ఐసోలేషన్‌లో వున్నాయి. కొందరు పేషెంట్లకు ప్లాస్మా ట్రీట్‌మెంట్‌ ఇవ్వడం జరుగుతోంది. వైరస్‌కి సంబంధించి రెండు మూడు వారాల్లో పీక్‌ స్టేజ్‌కి చేరుకునే అవకాశం వుంది. ప్రతిరోజూ 2000 లేబరేటరీ టెస్టులు కరోనా వైరస్‌ కోసం జరుగుతున్నాయి. ఇప్పటిదాకా మొత్తం 29000 కరోనా టెస్టులు జరిగాయి. పలు కేసుల్లో చికిత్స కోసం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ని వినియోగించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com