ఖతార్‌:గడువు ముగిసిన ఆహార పదార్థాల రీప్యాక్‌..19 మంది అరెస్ట్

- April 24, 2020 , by Maagulf
ఖతార్‌:గడువు ముగిసిన ఆహార పదార్థాల రీప్యాక్‌..19 మంది అరెస్ట్

దోహా:కరోనా కష్టకాలాన్ని అడ్డదారిలో డబ్బు సంపాదనకు వినియోంచుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు దుర్మార్గులు. మాస్కులు, శానిటైజర్లే కాదు..చివరికి తినే తిండి పదార్ధాల విషయంలోనూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖతార్‌ లోని ఉమ్‌ అబిరియా ప్రాంతంలోనూ కొందరు వ్యక్తులు ఇలాంటి మోసానికే పాల్పడబోయి పోలీసులకు దొరికిపోయారు. అరబ్‌, ఆసియా దేశాలకు చెందిన 19 మంది..గడువు ముగిసిన ఆహార పదార్ధాల ప్యాకెట్లను పడేయకుండా మళ్లీ కొత్తగా ప్యాక్‌ చేసి అమ్మేందుకు ప్రయత్నించబోయారు. అయితే..పోలీసుల తనిఖీల్లో వారి గుట్టుబయటపడింది. 19 మందిని అరెస్ట్ చేసి..న్యాయపరమైన విచారణకు తరలించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com