ఖతార్:గడువు ముగిసిన ఆహార పదార్థాల రీప్యాక్..19 మంది అరెస్ట్
- April 24, 2020
దోహా:కరోనా కష్టకాలాన్ని అడ్డదారిలో డబ్బు సంపాదనకు వినియోంచుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు దుర్మార్గులు. మాస్కులు, శానిటైజర్లే కాదు..చివరికి తినే తిండి పదార్ధాల విషయంలోనూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖతార్ లోని ఉమ్ అబిరియా ప్రాంతంలోనూ కొందరు వ్యక్తులు ఇలాంటి మోసానికే పాల్పడబోయి పోలీసులకు దొరికిపోయారు. అరబ్, ఆసియా దేశాలకు చెందిన 19 మంది..గడువు ముగిసిన ఆహార పదార్ధాల ప్యాకెట్లను పడేయకుండా మళ్లీ కొత్తగా ప్యాక్ చేసి అమ్మేందుకు ప్రయత్నించబోయారు. అయితే..పోలీసుల తనిఖీల్లో వారి గుట్టుబయటపడింది. 19 మందిని అరెస్ట్ చేసి..న్యాయపరమైన విచారణకు తరలించారు.
తాజా వార్తలు
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!