అబుధాబి: కరోనా పేషెంట్ల కోసం కేవలం 48 గంటల్లోనే ఆస్పత్రి నిర్మాణం
- April 24, 2020
అబుధాబి:కరోనా పేషెంట్లకు చికిత్స అందించేందుకు చైనా పది రోజుల్లో ఆస్పత్రిని నిర్మిస్తే..యూఏఈ ప్రభుత్వం కేవలం 48 గంటల్లోనే కొత్త ఆస్పత్రిని నిర్మించింది. అబుదాబిలోని షేక్ ఖలీఫా మెడికల్ సిటీలో ఈ కొత్త ఆస్పత్రిని నిర్మించారు. 127 పడకల ఈ ఆస్పత్రి సోమవారం వారం నుంచి ప్రారంభం కానుంది. 20 మంది డాక్టర్లు, 85 మంది నర్సులు పేషెంట్లకు సేవలు అందించనున్నారు. రోగుల సంరక్షణ చూసుకునే బంధువుల కోసం 12 ఫ్యామిలి రూమ్స్ కూడా ఉన్నాయి. ఎదైనా అవసరం ఉంటే వైద్య సిబ్బందిని పేషెంట్లు సంప్రదించేలా వీడియో కాలింగ్ సిస్టంను ఏర్పాటు చేశారు. ఆస్పత్రిని కేవలం 48 గంటల్లో నిర్మించటం పట్ల యూఏఈ యంత్రాంగం హర్షం వ్యక్తం చేసింది. యూఏఈ తలుచకుంటే ఏదీ అసంభవం కాదని షేక్ ఖలిఫా మెడికల్ సిటీ చీఫ్ ఫైనాన్సియర్ ఆఫీసర్ మొహమ్మద్ ఇస్సా అల్ మెహ్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







