ముఖ్యమంత్రులతో ముగిసిన ప్రధాని సమావేశం..
- April 27, 2020
ఢిల్లీ:ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మోదీ ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తీసుకున్న తరువాత లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపారు. కేంద్రం ప్రజలకు కొన్ని నిబంధనలను సడలించనుందని తెలుస్తోంది. 9 మంది ముఖ్యమంత్రులు లాక్ డౌన్ గురించి అభిప్రాయాలను పంచుకోగా నలుగురు ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగించాలని కోరారు.
ముఖ్యమంత్రులు ప్రధానంగా నిత్యావసరాలను, మరిన్ని విభాగాలను అనుమతించాలని కోరినట్టు పీఎం అందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. కేంద్ర బృందాల పర్యటన అనంతరం వారి అభిప్రాయాలను బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు అధికార వర్గాలు ప్రకటన చేశాయి. కేంద్రం ప్రధానంగా గ్రీన్ జోన్ ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలకు అంగీకరించిందని తెలుస్తోంది. హాట్ స్పాట్ ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాలలో వాణిజ్య సేవలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని తెలుస్తోంది.
ప్రజా రవాణా గురించి కూడా ప్రధానంగా చర్చ జరిగిందని సమాచారం. కేంద్రం ప్రజా రవాణా విషయంలో కూడా కొన్ని వెసులుబాట్లను కల్పించనుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







