ముఖ్యమంత్రులతో ముగిసిన ప్రధాని సమావేశం..
- April 27, 2020
ఢిల్లీ:ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మోదీ ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తీసుకున్న తరువాత లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపారు. కేంద్రం ప్రజలకు కొన్ని నిబంధనలను సడలించనుందని తెలుస్తోంది. 9 మంది ముఖ్యమంత్రులు లాక్ డౌన్ గురించి అభిప్రాయాలను పంచుకోగా నలుగురు ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగించాలని కోరారు.
ముఖ్యమంత్రులు ప్రధానంగా నిత్యావసరాలను, మరిన్ని విభాగాలను అనుమతించాలని కోరినట్టు పీఎం అందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. కేంద్ర బృందాల పర్యటన అనంతరం వారి అభిప్రాయాలను బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు అధికార వర్గాలు ప్రకటన చేశాయి. కేంద్రం ప్రధానంగా గ్రీన్ జోన్ ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలకు అంగీకరించిందని తెలుస్తోంది. హాట్ స్పాట్ ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాలలో వాణిజ్య సేవలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని తెలుస్తోంది.
ప్రజా రవాణా గురించి కూడా ప్రధానంగా చర్చ జరిగిందని సమాచారం. కేంద్రం ప్రజా రవాణా విషయంలో కూడా కొన్ని వెసులుబాట్లను కల్పించనుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







