యూఏఈ నుంచి ఎట్టకేలకు భారత్ చేరుకున్న NRIల మృతదేహాలు
- April 27, 2020
అబుధాబి:యూఏఈలో చనిపోయిన ముగ్గురు ఎన్ఆర్ఐల మృతదేహాల తరలింపులో ఎట్టకేలకు గందరగోళం తొలగిపోయింది. అబుధాబి నుంచి శనివారం కార్గో విమానంలో ముగ్గురి మృతదేహాలను తరలించగా..ఆదివారం ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అధికారులు మృతుల కుటుంబాలకు మృతదేహాలను అందించినట్లు యూఏఈలోని భారత రాయబారి పవన్ కపూర్ తెలిపారు. ఏప్రిల్ మూడో వారంలో ఎన్ఆర్ఐలు కమలేష్ భట్, సంజీవ్ కుమార్, జగ్సిర్ సింగ్ యూఏఈలో మృతిచెందారు. అయితే...కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కావటంలో ముగ్గురి మృతదేహాలను శుక్రవారం కార్గో విమానంలో ఢిల్లీ తరలించారు. అయితే..వారి మృతికి కరోనా వైరస్ కారణం కాకపోయినా..సరైన అనుమతులు లేని కారణంగా తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో మృతదేహాలను మళ్లీ యూఏఈ తిప్పిపంపించారు. దీంతో ప్రవాస భారతీయుల నుంచి నిరసన వ్యక్తం అయ్యింది. ముగ్గురు ఎన్ఆర్ఐల మృతికి కోవిడ్ కారణం కాకపోయినా ఎందుకు తిప్పిపంపారనే దుమారం చెలరేగింది. అయితే..దీనిపై స్పందించిన భారత్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళిధరన్..కార్గో విమానాల్లో మృతదేహాల తరలింపునకు సంబంధించి సరైన మార్గదర్శకాలు లేవని అందుకే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని వివరణ కూడా ఇచ్చారు.
ప్రవాస భారతీయుల మృతదేహాలు ఢిల్లీ నుంచి మళ్ళీ అబుధాబికి తిప్పిపంపటంతో యూఏఈలోని భారత రాయబార కార్యాలయం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ నేపథ్యంలో స్థానిక అధికారులు ఆయోమయపడి ఉంటారని విపుల్ అభిప్రాయపడ్డారు. అయితే..కరోనా వైరస్ తో చనిపోయిన వారి మృతదేహాలను పంపించటం లేదని కూడా స్పష్టం చేశారు. అయితే..ఎన్ఆర్ఐల మృతికి కరోనా వైరస్ కారణం కాకపోయినా..వారి మృతదేహాల తరలింపులో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉంచాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాయబార కార్యాలయాలు, హై కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయని..బహుశ ఈ నేపథ్యంలోనే గందరగోళం నెలకొని ఉంటుందని అన్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







