కోవిడ్ 19/దుబాయ్: జూలై నుండి పర్యాటకులను స్వాగతించే అవకాశం
- April 28, 2020
దుబాయ్: దుబాయ్ ఆర్ధిక వ్యవస్థకు ఆయువుపట్టు పర్యాటక రంగం. కరోనా తో పర్యాటక రంగం ఘోరంగా దెబ్బతింది. మార్చి నుండి పర్యాటక మరియు సందర్శకుల వీసాల జారీ నిలిపివేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది దుబాయ్ కి 16.7 మిలియన్ల మంది పర్యాటకులు విచ్చేయటం జరిగింది. వీరు స్థానిక ఆర్థిక వ్యవస్థకు 150 బిలియన్ దిర్హాములకు పైగా తోడ్పడ్డారు.
జూలై నుంచి పర్యాటకులను స్వాగతించేందుకు దుబాయ్ సన్నద్ధమవుతోందని వాణిజ్య మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ జనరల్ హెలాల్ అల్ మార్రి తెలిపారు. అప్పటి కోవిడ్ -19 పరిణామాలను మరియు అంతర్జాతీయ పరిణామాలను అనుసరించి పర్యాటక రంగాన్ని పూర్తి స్థాయిలో అనుమతించటమా లేక పరిమితిలో అనుమతించటమా అనేది ఆలోచిస్తామనీ, లేదా ఈ నిర్ణయం సెప్టెంబర్ వరకు వాయిదాపడే అవకాశం లేకపోలేదు అని హెలాల్ తెలిపారు.
ప్రస్తుతం, దేశంలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి యూఏఈ అధికారులు ఇన్-బౌండ్ ఎయిర్ ట్రాఫిక్ను నిలిపివేశారు. విదేశీ విమానయాన సంస్థల తో కూడి యూఏఈ లో చిక్కుకున్న విదేశీయులను వారి వారి స్వదేశాలకు పంపటం జరుగుతోందని ఈ సందర్భంగా హెలాల్ గుర్తుచేశారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







