యూ.ఏ.ఈ:అజ్మాన్ కార్మికులను ఐసోలేషన్ కేంద్రానికి తరలింపు
- April 29, 2020
అజ్మాన్: అల్ జుర్ఫ్ 3 ఇన్డిస్ట్రియాల్ ఏరియాలోని వర్కర్స్ క్యాంపు లో 12 మంది భారతీయ కార్మికులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు అజ్మన్ కెఎంసిసి(కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రానికి గత రాత్రి వీరందరిని తరలించటం జరిగింది.
ఈ 3 అంతస్తుల భవనంలో అన్ని వసతులతో కూడిన 84 గదులు కలవు.ఈ గదులలో గరిష్టంగా ఇద్దరు ఉండేడట్టుగా ఏర్పాట్లు చేశారు.రోగులకు కావాల్సిన నిత్యావసరాలను అజ్మాన్ కెఎంసిసి అందిస్తోంది.మెట్రో మెడికల్ సెంటర్ కి చెందిన వైద్య బృందం రోగులను పర్యవేక్షిస్తూ తగిన వైద్యం అందిస్తోంది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు కెఎంసిసి చూపిన చొరవకు హర్షం వ్యక్తం చేసిన ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్.ఈ సంధర్భంగా కార్మికులు తమకు సహాయ సహకారాలు అందించిన ఇండియన్ అసోసియేషన్,అజ్మాన్ , కెఎంసిసి(అజ్మాన్) ప్రెసిడెంట్ సూపీ పాతిరపట్టకు మరియు టీం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







