యూఏఈ: చొరవ తీసుకొని వారికి తెలపండి అంటున్న కాన్సుల్ జనరల్
- April 30, 2020
యూఏఈ: భారత్ వెళ్లాలనుకునేవారికి అబుధాబి లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసి ఫారం లో తమ వివరాలను నింపాలని ప్రవాసీయులను కోరింది. దీనికి స్పందిస్తూ ఆన్లైన్ పోర్టల్లో మొత్తం 9,000 మంది భారతీయులు నమోదు చేసుకున్నారు. పెద్దఎత్తున ప్రవాసీయులు ఈ సౌకర్యం వినియోగిస్తున్నందున వెబ్సైట్ లో కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. అధికారులు దీనిని సరిచేసేందుకు అన్ని చర్యలు చేపట్టారు.
దుబాయ్లోని భారత కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ, "ప్రకటించిన ఈ గణాంకాలు గురువారం (ఏప్రిల్ 30) ఉదయం 10 గంటల వరకు నమోదైనవి. డేటా సేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే, మేము డేటాను విశ్లేషించడం ప్రారంభించలేదు." వెబ్సైట్లో భారీగా ట్రాఫిక్ ఉన్నట్లు కనిపిస్తున్నందున కాన్సులేట్ దరఖాస్తుదారులు ఓర్పు వహించాలని ఈ సందర్భంగా విపుల్ కోరారు.
ఎమిరేట్స్లోని కమ్యూనిటీ గ్రూపులు మరియు భారతీయ సంఘాలు చొరవ తీసుకొని కార్మిక వర్గాలకు ఈ ఫారం గురించి తెలిపి నమోదు చేసుకోవడానికి సహాయం చేయమని కాన్సుల్ జనరల్ విపుల్ కోరారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..