యూఏఈ: చొరవ తీసుకొని వారికి తెలపండి అంటున్న కాన్సుల్ జనరల్
- April 30, 2020
యూఏఈ: భారత్ వెళ్లాలనుకునేవారికి అబుధాబి లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసి ఫారం లో తమ వివరాలను నింపాలని ప్రవాసీయులను కోరింది. దీనికి స్పందిస్తూ ఆన్లైన్ పోర్టల్లో మొత్తం 9,000 మంది భారతీయులు నమోదు చేసుకున్నారు. పెద్దఎత్తున ప్రవాసీయులు ఈ సౌకర్యం వినియోగిస్తున్నందున వెబ్సైట్ లో కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. అధికారులు దీనిని సరిచేసేందుకు అన్ని చర్యలు చేపట్టారు.
దుబాయ్లోని భారత కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ, "ప్రకటించిన ఈ గణాంకాలు గురువారం (ఏప్రిల్ 30) ఉదయం 10 గంటల వరకు నమోదైనవి. డేటా సేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే, మేము డేటాను విశ్లేషించడం ప్రారంభించలేదు." వెబ్సైట్లో భారీగా ట్రాఫిక్ ఉన్నట్లు కనిపిస్తున్నందున కాన్సులేట్ దరఖాస్తుదారులు ఓర్పు వహించాలని ఈ సందర్భంగా విపుల్ కోరారు.
ఎమిరేట్స్లోని కమ్యూనిటీ గ్రూపులు మరియు భారతీయ సంఘాలు చొరవ తీసుకొని కార్మిక వర్గాలకు ఈ ఫారం గురించి తెలిపి నమోదు చేసుకోవడానికి సహాయం చేయమని కాన్సుల్ జనరల్ విపుల్ కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







