యూఏఈ: చొరవ తీసుకొని వారికి తెలపండి అంటున్న కాన్సుల్ జనరల్
- April 30, 2020
యూఏఈ: భారత్ వెళ్లాలనుకునేవారికి అబుధాబి లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసి ఫారం లో తమ వివరాలను నింపాలని ప్రవాసీయులను కోరింది. దీనికి స్పందిస్తూ ఆన్లైన్ పోర్టల్లో మొత్తం 9,000 మంది భారతీయులు నమోదు చేసుకున్నారు. పెద్దఎత్తున ప్రవాసీయులు ఈ సౌకర్యం వినియోగిస్తున్నందున వెబ్సైట్ లో కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. అధికారులు దీనిని సరిచేసేందుకు అన్ని చర్యలు చేపట్టారు.
దుబాయ్లోని భారత కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ, "ప్రకటించిన ఈ గణాంకాలు గురువారం (ఏప్రిల్ 30) ఉదయం 10 గంటల వరకు నమోదైనవి. డేటా సేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే, మేము డేటాను విశ్లేషించడం ప్రారంభించలేదు." వెబ్సైట్లో భారీగా ట్రాఫిక్ ఉన్నట్లు కనిపిస్తున్నందున కాన్సులేట్ దరఖాస్తుదారులు ఓర్పు వహించాలని ఈ సందర్భంగా విపుల్ కోరారు.
ఎమిరేట్స్లోని కమ్యూనిటీ గ్రూపులు మరియు భారతీయ సంఘాలు చొరవ తీసుకొని కార్మిక వర్గాలకు ఈ ఫారం గురించి తెలిపి నమోదు చేసుకోవడానికి సహాయం చేయమని కాన్సుల్ జనరల్ విపుల్ కోరారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







