5.96 మిలియన్ టన్నుల ఫుడ్ తయారుచేస్తోన్న 568 యూఏఈ ఫ్యాక్టరీలు
- May 01, 2020
దుబాయ్:ఎమిరేట్స్ ఫుడ్ కౌన్సిల్, మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇండస్ట్రీతో కలిసి సంయుక్తంగా ఫుడ్ ప్రొడక్షన్కి సంబంధించిన వివరాల్ని వెల్లడించింది. మొత్తం 568 ఫ్యాక్టరీలు యూఏఈలో 5.96 మిలియన్ టన్నుల ఫుడ్ మరియు బెవరేజ్ ప్రోడక్ట్స్ని ప్రతి యేడాదీ తయారు చేస్తున్నాయనీ, ఇందులో 2.3 మిలియన్ టన్నుల ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ వుంటున్నాయని నివేదిక తెలిపింది. మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇండస్ట్రీ లైసెన్సింగ్ సిస్టమ్ ద్వారా రిజిస్టర్ అయిన ఫ్యాక్టరీల నుంచి సేకరించిన సమాచారమిది. అత్యవసర సమయాల్లో మరింతగా ఫుడ్ ప్రొడక్షన్ చేసేందుకు ఈ ఫ్యాక్టరీల్లో వెసులుబాట్లు వున్నాయని అధికారులు చెబుతున్నారు. అబుదాబీలో 40, దుబాయ్లో 315, షార్జాలో 77, అజ్మన్లో 73, ఉమ్ అల్ కువైన్లో 34, రస్ అల్ ఖైమాలో 23, ఫుజారియాలో 7 ఫ్యాక్టరీలు వున్నాయి. అత్యధికంగా వీటిల్లో 16.3 మిలియన్ టన్నుల ఆహారోత్పత్తుల్ని తయారు చేసేందుకు వీలుంది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







