కరోనాపై పోరాటం: స్టెరిలైజేషన్‌ రూల్స్‌ని అతిక్రమించిన యువత

- May 01, 2020 , by Maagulf
కరోనాపై పోరాటం: స్టెరిలైజేషన్‌ రూల్స్‌ని అతిక్రమించిన యువత

దుబాయ్‌ పోలీస్‌, కొందరు యువకులు స్టెరిలైజేషన్‌ రూల్స్‌ని అతిక్రమించి, ఓ ఇంటి ముందు గుమికూడారనీ, వారిని పోలీస్‌ స్టేషన్‌కి తరలించి, ఇంకోసారి ఇలాంటి అతిక్రమణలకు పాల్పడబోమని వారితో హామీ పత్రం రాయించినట్లు వెల్లడించింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని అల్‌ బర్షా పోలీస్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ అబ్దుల్‌రహీమ్ బిన్‌ షాఫీ పేర్కొన్నారు. కాగా, పబ్లిక్‌ గేదరింగ్స్‌కి పాల్పడితే, దాన్ని నిర్వహించినవారికి 10,000 దిర్హామ్ లు జరీమానా విధిస్తారు. ఒక్కో పార్టిసిపెంట్‌కీ 5,000 జరీమానా విధించడం జరుగుతుంది. మాస్క్‌లు ధరించకపోతే 1,000 దిర్హామ్ ల జరీమానా. ముగ్గురి కంటే ఎక్కువమంది ఓ వాహనంలో ప్రయాణిస్తే 1,000 దిర్హామ్ ల జరీమానా విధిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com