మస్కట్:నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన తెలంగాణ బిజెపి NRI సెల్
- May 05, 2020
మస్కట్:కరోనా పరిస్థితుల నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిరోధించే క్రమంలో చేపట్టిన లాక్ డౌన్ పరిస్థితులవల్ల ఒమన్ లో ఉన్న గల్ఫ్ కార్మికులు చేయడానికి పని లేక తినడానికి తిండి లేకా రూమ్ ల కిరాయిలు కట్టలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళను దృష్టిలో ఉంచుకొని "ఫీడ్ ద నీడీ" కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, తెలంగాణ బిజెపి NRI సెల్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ తోపాలి శ్రీనివాస్ పిలుపుమేరకు ఒమన్ లో బిజెపి తెలంగాణ NRI సెల్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు ఆధ్వర్యంలో 300 మందికి పదిహేను నుండి ఇరవై రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులను అందించారు. ఒమన్ లో రెండు నెలలు గా తినడానికి ఇబ్బంది పడుతున్నటువంటి వారు వీరు ప్రారంభించిన హెల్ప్ డెస్క్ కు ఫోన్ చేసి సంప్రదిస్తున్నారు. ఒమన్ కన్వీనర్ కుమార్ మంచికట్ల సీనియర్ నాయకులు బాపురెడ్డి, మురళి వడ్లపాటి, నరేష్ ఆంబోజి, అది చిగురు, గరిగే రమేష్, భానాలా భాస్కర్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి హెల్ప్ డెస్క్ ద్వారా నిత్యం వారిని సంప్రదిస్తూ సహాయం చేస్తున్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







