మస్కట్:నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన తెలంగాణ బిజెపి NRI సెల్
- May 05, 2020
మస్కట్:కరోనా పరిస్థితుల నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిరోధించే క్రమంలో చేపట్టిన లాక్ డౌన్ పరిస్థితులవల్ల ఒమన్ లో ఉన్న గల్ఫ్ కార్మికులు చేయడానికి పని లేక తినడానికి తిండి లేకా రూమ్ ల కిరాయిలు కట్టలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళను దృష్టిలో ఉంచుకొని "ఫీడ్ ద నీడీ" కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, తెలంగాణ బిజెపి NRI సెల్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ తోపాలి శ్రీనివాస్ పిలుపుమేరకు ఒమన్ లో బిజెపి తెలంగాణ NRI సెల్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు ఆధ్వర్యంలో 300 మందికి పదిహేను నుండి ఇరవై రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులను అందించారు. ఒమన్ లో రెండు నెలలు గా తినడానికి ఇబ్బంది పడుతున్నటువంటి వారు వీరు ప్రారంభించిన హెల్ప్ డెస్క్ కు ఫోన్ చేసి సంప్రదిస్తున్నారు. ఒమన్ కన్వీనర్ కుమార్ మంచికట్ల సీనియర్ నాయకులు బాపురెడ్డి, మురళి వడ్లపాటి, నరేష్ ఆంబోజి, అది చిగురు, గరిగే రమేష్, భానాలా భాస్కర్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి హెల్ప్ డెస్క్ ద్వారా నిత్యం వారిని సంప్రదిస్తూ సహాయం చేస్తున్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







