కువైట్:జీతాల్లో కోత విధించేందుకు రంగం సిద్ధం...కార్మిక చట్టాల్లో మార్పులు
- May 06, 2020
కువైట:కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రైవేట్ ఉద్యోగుల జీతాల్లో కోత విధించేందుకు రంగం సిద్ధం అయ్యింది. అందుకు అనుగుణంగా కువైట్ మంత్రివర్గం కార్మిక చట్టాల్లో కీలక సవరణలను ఆమోదించింది. దీంతో ఇక ప్రైవేట్ ఉద్యోగుల జీతాల్లో కోత విధించేందుకు యాజమాన్యాలకు అవకాశం దక్కనుంది. అయితే..ఉద్యోగులకు ఇష్టం లేకుండా జీతాల్లో కోత విధించేందుకు మాత్రం వీలు లేదు. కార్మికుల సమ్మతంతోనే యాజమాన్యాలు జీతాల్లో కోత విధించే వెసులుబాటు ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న కువైట్ కార్మిక చట్టాల ప్రకారం కంపెనీలు, సంస్థలు...కార్మికులు, ఉద్యోగుల జీతాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ కోత విధించేందుకు వీలులేదు. కార్మికులు ఆమోదం తెలిపినా..శాలరీలను తగ్గించేందుకు అవకాశం ఉండేది కాదు. దీంతో పలు కంపెనీలు తమ సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించి వాళ్లకు రావాల్సిన డబ్బులు ఇచ్చేసేవారు. ఆ తర్వాత వారితో మళ్లీ కొత్తగా ఒప్పందం కుదుర్చుకొని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోనేవారు. ప్రస్తుత సంక్షోభ పరస్థితుల్లోనూ పెద్ద కంపెనీలతో సహా పలు సంస్థలు తమ ఉద్యోగుల జీతాల్లో బలవంతంగా కోత విధించాయి. కొందర్ని తొలగించాయి. ఇంకొందరు ఉద్యోగులు కంపెనీ ఒత్తిడితో సెలవుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మిక చట్టాల్లో సవరణలు చేస్తూ కేబినెట్ ఆమోదించటాన్ని పలువురు పార్లమెంటేరియన్లు తప్పుబడుతున్నారు. తాము కార్మిక చట్టాల్లో మార్పులను ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెబుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?