కరోనా ఎఫెక్ట్ : ఎయిర్ అరేబియాలో 57 మంది ఉద్యోగుల తొలగింపు
- May 06, 2020
యూ.ఏ.ఈ:కరోనా దెబ్బతో ప్రపంచ దేశాలు ఆర్ధికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఆర్ధిక మాంద్యంతో పలు సంస్థలు, కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను అణ్వేషిస్తున్నాయి. యూఏఈలోని ఏకైకా లిస్టెడ్ విమానయాన సంస్థ ఎయిర్ అరబియా కూడా అదే పంథాలో ముందుకు వెళ్తోంది. తమ సంస్థ నుంచి 57 మంది ఉద్యోగులను తొలగించింది. కరోనా వైరస్ కారణంగా సర్వీసులు నిలిపివేయటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంస్థ ప్రతినిధి తెలిపారు. తమ సంస్థ చరిత్రలోనే ఉద్యోగులను తొలగించటం ఇదే మొదటిసారి అని..ఇలాంటి నిర్ణయం తీసుకోవటం బాధకరమే అయినా..తప్పడం లేదని విచారం వ్యక్తం చేశారు. మరోవైపు 2000 మంది ఉన్న షార్జా బేస్డ్ ఎయిర్ లైన్స్ కూడా గత మార్చి నుంచి సేవలను నిలిపివేసింది. మళ్లీ ఎప్పుడు ప్రారంభించేది ఇంకా స్పష్టం చేయలేదు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







