యూఏఈ టూ ఇండియా..విమాన సమయంలో మార్పులు
- May 06, 2020
దుబాయ్: భారతీయులను స్వదేశానికి పంపే కార్యక్రమం రేపటి నుండి మొదలుకానున్నది. మే 7, గురువారం మధ్యాహ్నం 2.10 గంటలకు కేరళలోని కోజికోడ్కు దుబాయ్ నుంచి బయలుదేరాల్సి ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ IX0344, మూడు గంటలు ఆలస్యంగా అనగా సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరుతుంది అని ప్రకటన.
దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్లోని ప్రెస్ కాన్సుల్ నీరజ్ అగర్వాల్ ఇలా అన్నారు: “సమయాలు సవరించబడ్డాయి. స్వదేశానికి తిరిగి పంపే విమానం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ IX0344 దుబాయ్ ఇంటర్నేషనల్ (టెర్మినల్ 2) నుండి కోజికోడ్కు రేపు సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరుతుంది. ధృవీకరించబడిన టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులు మాత్రమే విమానాశ్రయానికి వెళ్లాలి. వారు బయలుదేరే ఐదు గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలి. సుమారు 170 మంది ప్రయాణికులు ఈ విమానంలో ప్రయాణించనున్నారు" అని ఆయన తెలిపారు.
విమానాశ్రయాన్ని రద్దీ చేయవద్దని, సామాజిక దూరాన్ని కొనసాగించాలని, అధికారులు నిర్దేశించిన అన్ని అవసరమైన జాగ్రత్తలు పాటించాలని ఇండియన్ కాన్సులేట్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







