45 నిమిషాల్లో లోన్..

- May 06, 2020 , by Maagulf
45 నిమిషాల్లో లోన్..

లాక్డౌన్ నేపథ్యంలో ఆదాయం కోల్పోయిన వారికోసం ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ అత్యవసర రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం 45 నిమిషాల్లోనే రూ.5 లక్షల వరకు లోన్ తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇతర వ్యక్తిగత రుణాలతో పోల్చితే ఈ అత్యవసర రుణాలపై వడ్డీరేటు కూడా తక్కువగా ఉంటుంది. 10.5 శాతం వడ్డీ రేటుకే ఈ రుణం లభిస్తుంది. మరో ముఖ్యవిషయం రుణం తీసుకున్న 6 నెలల తరువాత నుంచి ఈఎంఐలు చెల్లించవచ్చు. ఈ రుణం పొందాలనుకునేవారు వీలునుబట్టి ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం onlinesbi.com లేదా sbi.co.inకి లాగిన్ అయి తెలుసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com