11,000 మంది ఖైదీలకు బెయిల్
- May 08, 2020
ముంబై:ముంబై నగరంలోని ఆర్థర్ రోడ్ జైలులో 103 మందికి వైరస్ సోకింది. కరోనా సోకిన ఖైదీలను, జైలు ఉద్యోగులను శుక్రవారం ఉదయం ఆస్పత్రులకు తరలించారు. గతంలో మాదకద్రవ్యాల కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. అతనికి పాజిటివ్ అని వచ్చింది దాంతో అతడితో పాటు ఉన్న మిగతా ఖైదీలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కోవిడ్ రోగులున్న కస్తుర్బా ఆస్పత్రికి ఎదురుగా ఆర్థర్ రోడ్ జైలు ఉంది. నిత్యావసరాలు సరఫరా చేసే వ్యక్తుల ద్వారా కరోనా సోకి ఉంటుందని జైలు అధికారులు భావిస్తున్నారు. నిజానికి ఈ జైల్లో 800 మంది ఖైదీలను మాత్రమే ఉంచాలి. కానీ 2600 మంది ఉన్నారు. దాంతో రద్దీగా ఉండడంతో కరోనా వచ్చి వుంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, జైల్లో కరోనా కేసులు వెలుగు చూసినందున చిన్న చిన్న నేరాలు చేసి జైల్లో ఉన్న 11 వేల మంది ఖైదీలను విడుదల చేసే యోచనలో ఉంది మహారాష్ట్ర సర్కారు. హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఖైదీల బంధువులు వారికి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే న్యాయవాదులను సంప్రదిస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!