కరోనా పై పోరాటం: యూఏఈ కి భారత వైద్యుల సాయం

- May 09, 2020 , by Maagulf
కరోనా పై పోరాటం: యూఏఈ కి భారత వైద్యుల సాయం

దుబాయ్: కరోనా తో పోరాడేందుకు సహాయంగా వైద్య బృందం పంపాలని యూఏఈ చేసిన అభ్యర్థనను భారత ప్రభుత్వం ఆమోదించి భారతదేశానికి చెందిన 88 మంది వైద్య నిపుణుల మొదటి బ్యాచ్ ఈ రాత్రి యూఏఈ కు పంపనుంది. ఆస్టర్ డిఎం హెల్త్‌కేర్ యొక్క నర్సులు బెంగళూరు నుండి దుబాయ్ కి ప్రత్యేక విమానంలో ప్రయాణించనున్నారు.

మహారాష్ట్ర, కర్ణాటక మరియు కేరళలోని మూడు ఆస్టర్ ఆసుపత్రుల నుండి నర్సులను ఎంపిక చేసి యూఏఈ పంపటం జరుగుతోంది. అంతేకాకుండా, భారతదేశంలో చిక్కుకున్న కొద్దిమంది నర్సులు కూడా ఈ విమానంలో తిరిగి వస్తారని తెలిసింది.

ఇంతకుముందు కువైట్ కు కూడా భారత్ వైద్యులు వెళ్లి అక్కడి ప్రభుత్వానికి కరోనా పై పోరాటంలో వైద్య సహాయం అందించిన విషయం గమనార్హం..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com