దుబాయ్లో మృతి చెందిన భారత వ్యాపారవేత్త ఛోయిత్రామ్
- May 11, 2020
దుబాయ్:జీబీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ జి.బి. చోయిత్రామ్ దుబాయ్లో తుది శ్వాస విడిచారు. 66 ఏళ్ళుగా దుబాయ్లో నివసిస్తున్నారు చోయిత్రామ్. ఆయన వయసు 90 సంవత్సరాలు. దుబాయ్ ఇండియన్ అసోసియేషన్ అలాగే ఇండియన్ స్పోర్ట్స్ క్లబ్కి గతంలో ప్రెసిడెంట్గా పనిచేశారాయన. ఇండియన్ హై స్కూల్ దుబాయ్కి ట్రస్టీగా కూడా వ్యవహరించారు. దుబాయ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్లో కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. జిబి చోయిత్రామ్ కి దీపక్ చోయిత్రామ్ జెత్వానీ, గిరీష్ చోయిత్రామ్ జెత్వానీ అనే ఇద్దరు కుమారులున్నారు. నలుగురు కుమార్తెలూ వున్నారాయనకు. దుబాయ్లో 1950లో వ్యాపార కార్యకలాపాల్ని జిబి చోయిత్రామ్ ప్రారంభించారు. దుబాయ్, బహ్రెయిన్ మరియు కువైట్లకు జిబి కుటుంబ సభ్యులు టెక్స్టైల్స్ ఎక్స్పోర్టర్స్గా పనిచేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?