దుబాయ్లో మృతి చెందిన భారత వ్యాపారవేత్త ఛోయిత్రామ్
- May 11, 2020
దుబాయ్:జీబీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ జి.బి. చోయిత్రామ్ దుబాయ్లో తుది శ్వాస విడిచారు. 66 ఏళ్ళుగా దుబాయ్లో నివసిస్తున్నారు చోయిత్రామ్. ఆయన వయసు 90 సంవత్సరాలు. దుబాయ్ ఇండియన్ అసోసియేషన్ అలాగే ఇండియన్ స్పోర్ట్స్ క్లబ్కి గతంలో ప్రెసిడెంట్గా పనిచేశారాయన. ఇండియన్ హై స్కూల్ దుబాయ్కి ట్రస్టీగా కూడా వ్యవహరించారు. దుబాయ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్లో కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. జిబి చోయిత్రామ్ కి దీపక్ చోయిత్రామ్ జెత్వానీ, గిరీష్ చోయిత్రామ్ జెత్వానీ అనే ఇద్దరు కుమారులున్నారు. నలుగురు కుమార్తెలూ వున్నారాయనకు. దుబాయ్లో 1950లో వ్యాపార కార్యకలాపాల్ని జిబి చోయిత్రామ్ ప్రారంభించారు. దుబాయ్, బహ్రెయిన్ మరియు కువైట్లకు జిబి కుటుంబ సభ్యులు టెక్స్టైల్స్ ఎక్స్పోర్టర్స్గా పనిచేశారు.
తాజా వార్తలు
- రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఏపీ ప్రజలకు విశాఖ AIG గుడ్ న్యూస్
- విద్యార్థులపై అరాచకాలకు పాల్పడిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: CJI
- శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
- ప్రధాని మోదీ వీడియో నిలిపివేత: కేంద్ర ప్రభుత్వానికి మెటా క్షమాపణలు!
- డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడితే భారీ జరిమానా..
- ప్రధాని మోదీతో స్కైరూట్ ఫౌండర్లు భేటీ: ‘విక్రమ్-1’ విజయవంతంపై ప్రశంసల వర్షం!
- ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
- ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!







