దుబాయ్‌లో మృతి చెందిన భారత వ్యాపారవేత్త ఛోయిత్‌రామ్

- May 11, 2020 , by Maagulf
దుబాయ్‌లో మృతి చెందిన భారత వ్యాపారవేత్త ఛోయిత్‌రామ్

దుబాయ్‌:జీబీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ జి.బి. చోయిత్‌రామ్ దుబాయ్‌లో తుది శ్వాస విడిచారు. 66 ఏళ్ళుగా దుబాయ్‌లో నివసిస్తున్నారు చోయిత్‌రామ్. ఆయన వయసు 90 సంవత్సరాలు. దుబాయ్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ అలాగే ఇండియన్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌కి గతంలో ప్రెసిడెంట్‌గా పనిచేశారాయన. ఇండియన్‌ హై స్కూల్‌ దుబాయ్‌కి ట్రస్టీగా కూడా వ్యవహరించారు. దుబాయ్‌ ఎలక్ట్రిసిటీ బోర్డ్‌లో కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. జిబి చోయిత్‌రామ్ కి దీపక్‌ చోయిత్‌రామ్ జెత్వానీ, గిరీష్‌ చోయిత్‌రామ్ జెత్వానీ అనే ఇద్దరు కుమారులున్నారు. నలుగురు కుమార్తెలూ వున్నారాయనకు. దుబాయ్‌లో 1950లో వ్యాపార కార్యకలాపాల్ని జిబి చోయిత్‌రామ్ ప్రారంభించారు. దుబాయ్‌, బహ్రెయిన్‌ మరియు కువైట్‌లకు జిబి కుటుంబ సభ్యులు టెక్స్‌టైల్స్‌ ఎక్స్‌పోర్టర్స్‌గా పనిచేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com