షాప్లలో ప్రవేశానికి మాస్క్ తప్పనిసరి
- May 12, 2020
మస్కట్: షాపింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్లోకి ఎవరైనా ప్రవేశించాలంటే ఖచ్చితంగా మాస్క్ ధరించాల్సిందే. అలాగే థర్మల్ స్కానింగ్ని కూడా తప్పనిసరి చేసినట్లు మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. ఓ వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 37.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా వుంటే, మాల్స్లోకి ప్రవేశం నిషిద్ధం. పిల్లల్ని కూడా షాపుల్లోకి అనుమతించరు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, షాపింగ్ సెంటర్స్, మాల్స్ అన్ని రకాలైన ట్రాలీలనూ ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాల్సి వుంటుంది. 2 మీటర్ల దూరం వ్యక్తుల మధ్య వుండేలా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగుల భద్రత విషయంలోనూ నిర్వాహకులే తగిన జాగ్రత్తలు చేపట్టాల్సి వుంటుంది. ఒకవేళ నిబంధనల్ని ఉల్లంఘిస్తే 500 ఒమన్ రియాల్స్ జరీమానా విదిస్తారు. మూడు రోజులపాటు ఆయా ఎస్టాబ్లిష్మెంట్స్ని మూసివేయడం కూడా జరుగుతుంది. రిపీట్ అయితే 2,000 ఒమన్ రియాల్జ్ జరీమానా 10 రోజులపాటు షాప్ మూసివేత జరుగుతుంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







