ప్రవాసీయులకు 3 నెలల గ్రేస్ పీరియడ్
- May 14, 2020
యూఏఈ: వీసా రద్దైన/గడువు ముగిసిన, వీసా చట్టాన్ని ఉల్లంఘిస్తూ యూఏఈ లో ఉంటున్న ప్రవాసులందరికీ జరిమానాలు రద్దు చేస్తూ మే 18 నుండి మూడు నెలల గ్రేస్ పీరియడ్ నిర్ణయించినట్లు ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ఎఫ్ఐఐసి) సీనియర్ అధికారి తెలిపారు.
ఎంట్రీ పర్మిట్లు మరియు రెసిడెన్సీ వీసాలు కలిగి ఉన్నవారితో సహా అన్ని నిర్వాసితులకు మినహాయింపు ఇస్తూ కాబినెట్ సమావేశంలో యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్ఐఐసి అధికారి తెలిపారు. ఈ నిబంధన మార్చి 1 న లేదా తరువాత చట్ట పరంగా వీసా గడువు ముగిసినవాటికి మాత్రమే అని తెలిపారు.
"మే 18 నుండి మూడు నెలల వరకు ప్రారంభమయ్యే గ్రేస్ పీరియడ్ పొందటానికి అన్ని నిర్వాసితులు FAIC పోర్టల్లో నమోదు చేసుకోవాలి. గడువు ముగిసిన ఎమిరేట్స్ ఐడిలు మరియు లేబర్ కార్డులకు సంబంధించిన అన్ని ఉల్లంఘనలు కూడా రద్దు చేయబడతాయి" అని బ్రిగేడియర్ అల్ కాబీ అన్నారు.
బుధవారం వరకు 1.5 మిలియన్లకు పైగా లావాదేవీలు FAIC పోర్టల్లో ప్రాసెస్ చేయబడ్డాయి.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







