విదేశాల నుంచి వచ్చేవారికి నిబంధనల మేరకు ఐసోలేషన్‌

- May 15, 2020 , by Maagulf
విదేశాల నుంచి వచ్చేవారికి నిబంధనల మేరకు ఐసోలేషన్‌

మస్కట్‌: విదేశాల నుంచి వచ్చేవారికి నిబంధనల మేరకు ఐసోలేషన్‌ వుంటుందని అథారిటీస్‌ చెబుతున్నాయి. విదేశాలకు పలు కారణాలతో వెళ్ళి, అక్కడే వుండిపోయినవారు తమవారిని కలుసుకునేందుకు వచ్చే క్రమంలో ఎయిర్‌ పోర్టుల వద్దనే పరీక్షలు చేయించుకోవాల్సి వుంటుంది. అనంతరం వారికి నిబంధనలకు అనుగుణంగా ఐసోలేషన్‌ విధిస్తారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ స్పష్టతనిచ్చింది. మినిస్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ అహ్మద్‌ అల్‌ సయీది ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిర్‌ ట్రాఫిక్‌ ప్రస్తుతం లిమిటెడ్‌గానే వుందని చెప్పారు. సుప్రీం కమిటీ నేపథ్యంలో మినిస్ట్రీ ఓ కమిటీని ఏర్పాటు చేసిందనీ, ఆ కమిటీ నిబంధనల మేరకు చర్యలు తీసుకోబడ్తాయని వివరించారు. కరోనా వైరస్‌కి వ్యాక్సిన్‌ వచ్చేదాకా. కొత్త నిబంధనలు అమల్లో వుంటాయని ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com