మాస్క్‌ ధరించకపోతే జరీమానా, జైలు

- May 15, 2020 , by Maagulf
మాస్క్‌ ధరించకపోతే జరీమానా, జైలు

దోహా: ప్రతి ఒక్కరూ ఫేస్‌ మాస్క్‌ తప్పక ధరించాల్సిందేనని ఖతార్‌లో ఆదేశాలు జారీ అయ్యాయి. ఉల్లంఘనలులకు 55,000 డాలర్ల వరకూ జరీమానా విధిస్తారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంటి నుంచి ఎవరు బయటకు వచ్చినా, తప్పక ఫేస్‌ మాస్క్‌ ధరించాలని లేని పక్షంలో 200,000 రియాల్స్‌ వరకూ (55,000 డాలర్లు) జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుందనీ, అదే సమయంలో వారికి మూడేళ్ళ వరకు జైలు శిక్ష విధించే అవకావం కూడా వుంటుందని తెలుస్తోంది. కాగా, ఖతార్‌లో 28,000 మందికి పైగా కరోనా వైరస్‌ బారిన పడ్డారు. అయితే, కేవలం 14 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు రెస్టారెంట్లు, బార్‌లు, మసీదులు, సినిమా ది¸యేటర్లను మూసివేశారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com