కువైట్:పూర్తి కర్ఫ్యూ విధించటంతో మహబౌలా,జ్లీబ్ ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాల తొలగింపు
- May 16, 2020
కువైట్:జ్లీబ్ అల్ షయౌఖ్, మహబౌలా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెక్యూరిటీ చెక్ పాయింట్స్ అన్నింటిని అధికారులు తొలగించారు. దేశమంతా పూర్తి స్థాయి కర్ఫ్యూ విధించటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే..కరోనా వ్యప్తి నివారణలో భాగంగా జ్లీబ్, మహబౌలా ప్రాంతాల్లో గత నెలలోనే పూర్తిగా కర్ఫ్యూ విధించారు. దీంతో ఆయా నగరాల్లోకి ఇతర ప్రాంతాల వారు రాకుండా..ఆ నగరాల ప్రజలకు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి తనఖీలు చేపట్టారు. కానీ, కరోనా తీవ్రత పెరగటంతో దేశమంతా పూర్తిస్థాయిలో కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తర్వాత వాహనాల తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం లేకపోవటంతో చెక్ పాయింట్లను తొలగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
నిషేధాజ్ఞాలు రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న తర్వాతే మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అధికారులు చెబుతున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







