ఒమన్:ప్రవాసీయులకు ఉచిత చికిత్సపై స్పష్టత ఇచ్చిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ
- May 16, 2020
మస్కట్:ఒమన్ లోని ప్రవాసీయులకు ప్రభుత్వం ఉచిత చికిత్స అందించనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఒమన్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. బెంగాలీలో ఉన్న ఫేస్ బుక్ ఫేజీతో సహా పలు సామాజిక మాధ్యమాల్లో ఇటీవల ఉచిత చికిత్సపై అసత్య ప్రచారం జరుగుతోంది. ప్రవాసీయుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని అపోహలు సృష్టించేలా సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ లు పెడుతున్నట్లు ఒమన్ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఆరోగ్యమంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రవాసీయులకు అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందనే అంశాన్ని కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారని..ప్రభుత్వం వైద్య ఖర్చులను భరించబోదని స్పష్టం చేసింది. అయితే..ప్రవాసీయులకు స్పాన్సర్స్ ఉంటే..వారి వైద్య ఖర్చులన్నింటిని స్పాన్సర్స్ భరిస్తారని, అలాగే ప్రవాసీయులకు ఇన్సూరెన్స్ ఉంటే..ఇన్సూరెన్స్ కంపెనీలు ట్రీట్మెంట్ ఖర్చులను భరిస్తాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







