ఏ.పి లో కొత్తగా 45 కోవిడ్-19 పాజిటివ్‌ కేసులు

- May 21, 2020 , by Maagulf
ఏ.పి లో కొత్తగా 45  కోవిడ్-19 పాజిటివ్‌ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19 వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 8,092 మంది నమూనాలు పరీక్షించగా 45 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,452కి చేరింది. కరోనాతో ఇవాళ నెల్లూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 54కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న 1689 మందిని డిశ్చార్జి చేశారు. వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 718 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో కోయంబేడు కాంటాక్ట్‌ కేసులు నాలుగు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com