పసుపుగా వస్తున్న పొగకు బెంబేలెత్తిన విశాఖ ప్రజలు
- May 21, 2020విశాఖ: నగరంలో మళ్లీ కలకలం రేగింది. HPCL కంపెనీ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. పసుపుగా పొగ రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చారు. HPCL రిఫైనరీలోని ఎస్హెచ్యూని తెరిచే సమయంలో ఘటన జరిగింది. ఎలాంటి ప్రమాదం లేదని HPCL వర్గాలు అంటున్నాయి.
ఇటీవలే ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి స్టైరిన్ గ్యాస్ లీక్ అయ్యి 12 మంది చనిపోయారు. పలువురు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటనలో చిన్నారులు కూడా అస్వస్థకు గురయ్యారు. వీరందరికీ ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. కొంతమంది డిస్చార్జ్ అయ్యారు. ఈ ఘటన నుంచి కోలుకోకముందే మళ్ళీ HPCL కంపెనీ నుంచి ఒక్కసారిగా పొగ రావటంతో విశాఖ ప్రజలు బెంబేలెత్తిపోయారు.
తాజా వార్తలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..