పసుపుగా వస్తున్న పొగకు బెంబేలెత్తిన విశాఖ ప్రజలు

- May 21, 2020 , by Maagulf
పసుపుగా వస్తున్న పొగకు బెంబేలెత్తిన విశాఖ ప్రజలు

విశాఖ: నగరంలో మళ్లీ కలకలం రేగింది. HPCL‌ కంపెనీ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. పసుపుగా పొగ రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.  ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చారు. HPCL‌ రిఫైనరీలోని ఎస్‌హెచ్‌యూని తెరిచే సమయంలో ఘటన జరిగింది. ఎలాంటి ప్రమాదం లేదని HPCL‌ వర్గాలు అంటున్నాయి.

ఇటీవలే ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి స్టైరిన్ గ్యాస్ లీక్ అయ్యి 12 మంది చనిపోయారు. పలువురు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటనలో చిన్నారులు కూడా అస్వస్థకు గురయ్యారు. వీరందరికీ ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. కొంతమంది డిస్చార్జ్ అయ్యారు. ఈ ఘటన నుంచి కోలుకోకముందే మళ్ళీ HPCL కంపెనీ నుంచి ఒక్కసారిగా పొగ రావటంతో విశాఖ ప్రజలు బెంబేలెత్తిపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com