ఏపీలో 47 కరోనా పాజిటివ్ కేసులు
- May 23, 2020అమరావతి:ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో 9 వేల 136 శాంపుల్స్ పరీక్షించగా 47 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కొత్తగా నమోదైన కేసులతో కోయంబేడు లింకులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో పాజిటివ్ వచ్చిన ముగ్గురికి, నెల్లూరు జిల్లాలో మరో ఇద్దరికి కోయంబేడు లింక్ తోనే వైరస్ సోకినట్లు అధికారులు చెబుతున్నారు. గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసులతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేల 561కి పెరిగింది. కరోనాతో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 56 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో యాక్టీవ్ కేసులు 727 ఉన్నట్లు కరోనాపై విడుదలైన హెల్త్ బులెటిన్ లో అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..