ప్రముఖ మిమిక్రీ కళాకారుడు హరికిషన్ కన్నుమూత
- May 23, 2020తెలుగు రాష్ట్రాల్లో వేలాది ప్రదర్శనలో ప్రజలను అలరించిన ప్రముఖ మికిక్రీ కళాకారుడు, సినీనటుడు హరికిషన్(57) ఇకలేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. వందమందికిపై గొంతుకలను అనుకరించే ఆయన ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు.
హరికిషన్ స్వస్థలం ఏపీలోని ఏలూరు. బాల్యంలోనే మిమిక్రీపై ఆసక్త పెంచుకున్న ఆయన మిమిక్రీ దిగ్గజం నేరెళ్ల వేణుమాధవ్ స్ఫూర్తితో ధ్వన్యనుకరణపై పట్టుసాధించారు. ఎన్టీఆర్ , అక్కినేని, చిరంజీవి ల గొంతుకలను బాగా అనుకరించేవారు. వైఎస్ఆర్ , కేసీఆర్ , వీహెచ్ వంటి రాజకీయ నాయకుల గొంతులు కూడా ఆయనకు కొట్టినపిండే. కొన్నాళ్లు స్కూల్లో టీచర్ గా పనిచేసి హరికిషన్ ఆ జీవితం నచ్చక పూర్తి స్థాయి మిమిక్రీ కళాకారుడిగా మారారు.సినిమాల్లో చిన్నచిన్న వేషాలు కూడా వేశారు. టీవీ చానళ్లలో లెక్కలేనన్ని ప్రదర్శనలు ఇచ్చారు. పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీ లెక్చరర్గా పనిచేశారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..