'నాంది' డబ్బింగ్ ప్రారంభం
- May 25, 2020
అల్లరి నరేష్ హీరోగా ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఇంటెన్స్ ఫిల్మ్ 'నాంది' డబ్బింగ్ పనులు రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం మొదలయ్యాయి. విజయ్ కనకమేడల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 'ఎ న్యూ బిగినింగ్' అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక.
సామాజిక అంశాల మేళవింపుతో, క్రైమ్ థ్రిల్లర్ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రమిది. అల్లరి నరేష్ కామెడీ శైలికి పూర్తి భిన్నంగా వినూత్న కథ, కథనాలతో రూపుదిద్దుకుంటోంది. ఇది అల్లరి నరేశ్ నటిస్తోన్న 57వ చిత్రం. ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగే ఈ భిన్న తరహా చిత్రానికి అబ్బూరి రవి, చోటా కె. ప్రసాద్, శ్రీచరణ్ పాకాల, బ్రహ్మ కడలి వంటి ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.
వరలక్ష్మీ శరత్కుమార్, హరీష్ ఉత్తమన్, ప్రియదర్శి, ప్రవీణ్ కీలక పాత్రధారులైన ఈ చిత్రానికి సంభాషణలు: అబ్బూరి రవి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఛాయాగ్రహణం: సిధ్, ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్, కళ: బ్రహ్మ కడలి.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







