కువైట్/కరోనా: పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన ఆ కార్మికులకు అమరవీరుల హోదా
- May 26, 2020
కువైట్: "COVID-19 తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన కార్మికులను కువైట్ ప్రభుత్వం అమరవీరులుగా పరిగణించాలని కేబినెట్ నిర్ణయించింది" అని సివిల్ సర్వీస్ అండర్ సెక్రటరీ బదర్ అల్ హమద్ అన్నారు. ఈ హోదా చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆర్థిక మరియు నైతిక చికిత్సకు అర్హులుగా చేస్తుంది.
ఫిబ్రవరి 24 నుండి మే 31 వరకు COVID-19 తో పోరాడుతున్న కార్మికులను మూడు విభాగాలుగా అనగా హై-రిస్క్, మీడియం-రిస్క్ మరియు తక్కువ రిస్క్ గా విభజిస్తామని అల్ హమద్ వివరించారు. అధిక-రిస్క్ వర్గం - ఆరోగ్య మరియు అంతర్గత మంత్రిత్వ శాఖల కార్మికులకు వర్తిస్తుంది; మీడియం రిష్ వర్గం - వారి ఉద్యోగాలు చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది; తక్కువ రిస్క్ - మూడవది దేశంలో కర్ఫ్యూ సమయంలో ముందుండి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది అని అల్ హమద్ వివరించారు. పైన పేర్కొన్న వర్గాల ప్రకారం కార్మికుల పేర్ల జాబితాలను సివిల్ సర్వీస్ విభాగానికి పంపనున్నారు.
ప్రశంసలో భాగంగా, COVID-19 సంక్షోభ పోరాటంలో నిమగ్నమైన ప్రతి కార్మికుడిని 'ఆర్డర్ ఆఫ్ కువైట్ ఫర్ కరోనావైరస్ కంబాట్' అనే ప్రత్యేక పతకంతో అభినందించనున్నట్టు అల్ హమద్ తెలిపారు.
తాజా వార్తలు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- హిట్-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!
- ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..







