దోహా:మళ్లీ ప్రారంభమైన వింటర్ కూరగాయల మార్కెట్..కొత్త టైమింగ్స్ అమలు

- May 27, 2020 , by Maagulf
దోహా:మళ్లీ ప్రారంభమైన వింటర్ కూరగాయల మార్కెట్..కొత్త టైమింగ్స్ అమలు

దోహా:రమదాన్ సందర్భంగా 3 రోజుల సెలవుల తర్వాత వింటర్ కూరగాయల మార్కెట్లు మళ్లీ ప్రారంభం అయ్యింది. అయితే..అల్ మజ్రోవా, అల్ వక్రా, అల్ ఖోర్, అల్ ధాకిరాలోని కూరగాయల మార్కెట్లలో కొత్త సమయాలను అమలు చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మార్కెట్ల సమయాలను కుదించారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే మార్కెట్లు తెరిచి ఉంటాయని పురపాలక, పర్యావరణ మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. అయితే..మార్కెట్లో కూరగాయల దుకాణాల యజమానులతో పాటు వినియోగదారులు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు పాటించాలని కూడా మంత్రిత్వ శాఖ సూచించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా సహకరించాలని కోరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com