రువి, దర్సయిత్, వాడి కబిర్, హర్మియాలలో చెక్పోస్టులు
- May 28, 2020మస్కట్: మస్కట్ గవర్నరేట్లో లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ, పలు ప్రాంతాల్లో చెక్పోస్టులు కొనసాగుతాయి. ముట్రా, రువి, దర్సయిత్, వాడి కబిర్, హర్మియాలలో చెక్పోస్టులు కొనసాగుతాయని రాయల్ ఒమన్ పోలీస్ మేజర్ జనరల్ మొహమ్మద్ అల్ హాష్మి చెప్పారు. విలాయత్ ముట్రా ఇంకా హెల్త్ ఐసోలేషన్లోనే కొనసాగుతుందని ఆయన వివరించారు. రువి, దర్సయిత్, వాడి అల్ కబిర్, అల్ హర్మియా ప్రాంతాలు గ్రేటర్ ముట్రాహ్లో వుంటాయని ఆయన చెప్పారు. గతంలోలానే ఈ ప్రాంతాలోని వాహనదారులు చెక్పోస్టుల గుండా వెళ్ళాల్సి వుంటుంది. ఇతర ప్రాంతాలకు పని నిమిత్తం వెళ్ళేవారు వ్యాలీడ్ రీజన్తో వెళ్ళాల్సి వుంటుంది. రెంటల్ ఎగ్రిమెంట్ని వారు తమతోపాటు తీసుకెళ్ళక తప్పదు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్