కోవిడ్ 19: ఐసోలేషన్ నుంచి కరోనా పేషెంట్ల డిశ్చార్జ్ కు కొత్త మార్గనిర్దేశకాలు
- May 28, 2020
దుబాయ్:ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్ల డిశ్చార్జ్ కు సంబంధించి దుబాయ్ ఆరోగ్య శాఖ అధికారులు కొత్త మార్గనిర్దేశకాలను విడుదల చేశారు. ఈ కొత్త మార్గదర్శకాలు ప్రకారం ఐసోలేషన్ వార్డుల్లో 14 రోజులు పూర్తి చేసుకున్న పేషెంట్లను డిశ్చార్జ్ చేయవచ్చు. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నా కూడా వారిని ఇంటికి పంపిస్తారు. కరోనా వ్యాధి సోకి ఐసోలేషన్ వార్డులో చేరిన నాటి నుంచి 14 రోజుల పాటు అతన్ని అబ్జర్వేషన్ లో ఉంచుతారు. ఆ తర్వాత వరుసగా మూడు రోజులు టెంపరేచర్ పరిశీలిస్తారు. వరుసగా మూడు రోజులు జ్వరం లేకుంటే మళ్లీ కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండానే పేషెంట్ ను ఐసోలేషన్ సెంటర్ నుంచి డిశ్చార్జ్ చేయవచ్చు. అయితే..షేషెంట్ నుంచి శాంపిల్స్ తీసుకున్ననాటి నుంచి గానీ, లక్షణాలు కనిపించిన తొలి రోజు నుంచి వరుసగా 14 రోజులను లెక్కగట్టాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు