కోవిడ్ 19: ఐసోలేషన్ నుంచి కరోనా పేషెంట్ల డిశ్చార్జ్ కు కొత్త మార్గనిర్దేశకాలు
- May 28, 2020
దుబాయ్:ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్ల డిశ్చార్జ్ కు సంబంధించి దుబాయ్ ఆరోగ్య శాఖ అధికారులు కొత్త మార్గనిర్దేశకాలను విడుదల చేశారు. ఈ కొత్త మార్గదర్శకాలు ప్రకారం ఐసోలేషన్ వార్డుల్లో 14 రోజులు పూర్తి చేసుకున్న పేషెంట్లను డిశ్చార్జ్ చేయవచ్చు. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నా కూడా వారిని ఇంటికి పంపిస్తారు. కరోనా వ్యాధి సోకి ఐసోలేషన్ వార్డులో చేరిన నాటి నుంచి 14 రోజుల పాటు అతన్ని అబ్జర్వేషన్ లో ఉంచుతారు. ఆ తర్వాత వరుసగా మూడు రోజులు టెంపరేచర్ పరిశీలిస్తారు. వరుసగా మూడు రోజులు జ్వరం లేకుంటే మళ్లీ కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండానే పేషెంట్ ను ఐసోలేషన్ సెంటర్ నుంచి డిశ్చార్జ్ చేయవచ్చు. అయితే..షేషెంట్ నుంచి శాంపిల్స్ తీసుకున్ననాటి నుంచి గానీ, లక్షణాలు కనిపించిన తొలి రోజు నుంచి వరుసగా 14 రోజులను లెక్కగట్టాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







