కోవిడ్ 19: ఐసోలేషన్ నుంచి కరోనా పేషెంట్ల డిశ్చార్జ్ కు కొత్త మార్గనిర్దేశకాలు
- May 28, 2020
దుబాయ్:ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్ల డిశ్చార్జ్ కు సంబంధించి దుబాయ్ ఆరోగ్య శాఖ అధికారులు కొత్త మార్గనిర్దేశకాలను విడుదల చేశారు. ఈ కొత్త మార్గదర్శకాలు ప్రకారం ఐసోలేషన్ వార్డుల్లో 14 రోజులు పూర్తి చేసుకున్న పేషెంట్లను డిశ్చార్జ్ చేయవచ్చు. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నా కూడా వారిని ఇంటికి పంపిస్తారు. కరోనా వ్యాధి సోకి ఐసోలేషన్ వార్డులో చేరిన నాటి నుంచి 14 రోజుల పాటు అతన్ని అబ్జర్వేషన్ లో ఉంచుతారు. ఆ తర్వాత వరుసగా మూడు రోజులు టెంపరేచర్ పరిశీలిస్తారు. వరుసగా మూడు రోజులు జ్వరం లేకుంటే మళ్లీ కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండానే పేషెంట్ ను ఐసోలేషన్ సెంటర్ నుంచి డిశ్చార్జ్ చేయవచ్చు. అయితే..షేషెంట్ నుంచి శాంపిల్స్ తీసుకున్ననాటి నుంచి గానీ, లక్షణాలు కనిపించిన తొలి రోజు నుంచి వరుసగా 14 రోజులను లెక్కగట్టాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!







