కోవిడ్ 19: ఐసోలేషన్ నుంచి కరోనా పేషెంట్ల డిశ్చార్జ్ కు కొత్త మార్గనిర్దేశకాలు
- May 28, 2020
దుబాయ్:ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్ల డిశ్చార్జ్ కు సంబంధించి దుబాయ్ ఆరోగ్య శాఖ అధికారులు కొత్త మార్గనిర్దేశకాలను విడుదల చేశారు. ఈ కొత్త మార్గదర్శకాలు ప్రకారం ఐసోలేషన్ వార్డుల్లో 14 రోజులు పూర్తి చేసుకున్న పేషెంట్లను డిశ్చార్జ్ చేయవచ్చు. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నా కూడా వారిని ఇంటికి పంపిస్తారు. కరోనా వ్యాధి సోకి ఐసోలేషన్ వార్డులో చేరిన నాటి నుంచి 14 రోజుల పాటు అతన్ని అబ్జర్వేషన్ లో ఉంచుతారు. ఆ తర్వాత వరుసగా మూడు రోజులు టెంపరేచర్ పరిశీలిస్తారు. వరుసగా మూడు రోజులు జ్వరం లేకుంటే మళ్లీ కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండానే పేషెంట్ ను ఐసోలేషన్ సెంటర్ నుంచి డిశ్చార్జ్ చేయవచ్చు. అయితే..షేషెంట్ నుంచి శాంపిల్స్ తీసుకున్ననాటి నుంచి గానీ, లక్షణాలు కనిపించిన తొలి రోజు నుంచి వరుసగా 14 రోజులను లెక్కగట్టాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







