వందే భారత్ మిషన్:పైలట్కు కోవిడ్-19.. విమానం వెనక్కి
- May 30, 2020న్యూఢిల్లీ:వందేభారత్ మిషన్లో భాగంగా మాస్కో బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని మధ్య నుంచే వెనక్కి పిలిపించారు. ఫైలట్కు కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ఉజ్బెకిస్తాన్ నుంచి ఖాళీ విమానాన్ని రప్పించారు. విదేశాల్లో ఉన్న భారతీయులను వందేభారత్ మిషన్ ద్వారా స్వదేశానికి తరలిస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మాస్కోకు ఎయిర్ ఇండియా ఏ-320 విమానం కూడా బయల్దేరింది. ఫైలట్ సహా సిబ్బందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. విమానం ఉజ్బెకిస్తాన్ గగనతలంలో ఉండగా.. ఫైలట్కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని తెలిసింది. దీంతో అధికారులు వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. విమానాన్ని వెంటనే ఇండియా రావాలని ఆదేశించారు. దీంతో విమానం ఖాళీగానే ఢిల్లీ చేరుకుంది.
విమానం ల్యాండయిన వెంటనే ఫైలట్ సహా సిబ్బందిని క్వారంటైన్లోకి తరలించారు. మాస్కోలో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు మరో విమానం పంపిస్తామని ఏవియేషన్ అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాపించడంతో మార్చి 23వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉన్నవారిని మాత్రం 'వందేభారత్ మిషన్' ద్వారా తీసుకొస్తున్నారు. లాక్ డౌన్ 4.0 సడలింపులతో దేశంలో విమానాలు మాత్రం తిరుగుతున్నాయి.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్