ఆంక్షల ఎత్తివేత తర్వాతే యూఏఈకి ఎన్ఆర్ఐల తరలింపు
- May 31, 2020దుబాయ్:యూఏఈ వీసా కలిగిన ఎన్ఆర్ఐల కోసం భారత ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. లాక్ డౌన్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో తిరిగి యూఏఈ వెళ్లేందుకు తమకు పెద్ద సంఖ్యలో ప్రవాసీయుల నుంచి విన్నపాలు వస్తున్నాయని తెలిపింది. అయితే..ప్రవాసీయులను తమ దేశంలోకి అనుమతించే విషయంలో యూఏఈలో ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. యూఏఈ ప్రవాసీయులపై ఆంక్షలను ఎత్తివేసిన తర్వాతే భారత్ లో ఉండిపోయిన యూఏఈ వీసాదారులు తిరిగి యూఏఈ వెళ్లేందుకు అవకాశం ఉంటుందని కూడా వివరించింది. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ యూఏఈ వీసాదారులను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
ఇదిలాఉంటే..కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు కావటంతో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన యూఏఈ వీసాదారులు..తిరిగి యూఏఈ వచ్చేందుకు ఆన్ లైన్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని యూఏఈ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించి మే 18 నుంచి ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని అనుమతి పొందిన వారు జూన్ 1 నుంచి యూఏఈకి తిరుగు ప్రయాణం కావొచ్చని అంతర్జాతీయ సహకార, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కోసం http://smartservices.ica.gov.ae.వెబ్ సైట్ లోని రెసిడెంట్స్ ఎంట్రీ పర్మిట్ లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఐసీఏ స్మార్ట్ సర్వీస్ సిస్టం ద్వారా మీరు ఈ మెయిల్ అడ్రస్ పంపించగానే మీకు వెరిఫికేషన్ ఈ మెయిల్ వస్తుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
తాజా వార్తలు
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్