ఆంక్షల ఎత్తివేత తర్వాతే యూఏఈకి ఎన్ఆర్ఐల తరలింపు
- May 31, 2020
దుబాయ్:యూఏఈ వీసా కలిగిన ఎన్ఆర్ఐల కోసం భారత ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. లాక్ డౌన్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో తిరిగి యూఏఈ వెళ్లేందుకు తమకు పెద్ద సంఖ్యలో ప్రవాసీయుల నుంచి విన్నపాలు వస్తున్నాయని తెలిపింది. అయితే..ప్రవాసీయులను తమ దేశంలోకి అనుమతించే విషయంలో యూఏఈలో ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. యూఏఈ ప్రవాసీయులపై ఆంక్షలను ఎత్తివేసిన తర్వాతే భారత్ లో ఉండిపోయిన యూఏఈ వీసాదారులు తిరిగి యూఏఈ వెళ్లేందుకు అవకాశం ఉంటుందని కూడా వివరించింది. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ యూఏఈ వీసాదారులను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
ఇదిలాఉంటే..కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు కావటంతో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన యూఏఈ వీసాదారులు..తిరిగి యూఏఈ వచ్చేందుకు ఆన్ లైన్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని యూఏఈ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించి మే 18 నుంచి ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని అనుమతి పొందిన వారు జూన్ 1 నుంచి యూఏఈకి తిరుగు ప్రయాణం కావొచ్చని అంతర్జాతీయ సహకార, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కోసం http://smartservices.ica.gov.ae.వెబ్ సైట్ లోని రెసిడెంట్స్ ఎంట్రీ పర్మిట్ లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఐసీఏ స్మార్ట్ సర్వీస్ సిస్టం ద్వారా మీరు ఈ మెయిల్ అడ్రస్ పంపించగానే మీకు వెరిఫికేషన్ ఈ మెయిల్ వస్తుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







