తెలంగాణలో కొత్తగా 99 కరోనా పాజిటివ్ కేసులు

- June 02, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 99 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో కొత్తగా 99 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.మరో నలుగురు మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,891కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 87 మంది స్థానికులు కాగా, 12 మంది వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు 1,526 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 92 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,273 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

తాజా కేసుల్లో GHMC పరిధిలో 70, రంగారెడ్డి జిల్లాలో 7, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1, మేడ్చల్‌ జిల్లాలో 3, జగిత్యాల జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 2, మంచిర్యాల జిల్లాలో 1, సంగారెడ్డి జిల్లాలో 1, సిద్ధిపేట జిల్లాలో 1 నమోదయ్యాయి. 

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com