రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- July 08, 2026
విజయవాడ: డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉపకులపతి డా.పులాల చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను బుధవారం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ ప్రతినిధి బృందంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, డైరెక్టర్ (రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్), డైరెక్టర్ ఆఫ్ పబ్లికేషన్స్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇటీవల విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన విజయవంతంగా నిర్వహించిన డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ 29వ, 30వ స్నాతకోత్సవాల విశిష్ట ఘట్టాలను ప్రతిబింబించే స్మారక ఫోటో ఆల్బమ్ను ఉపకులపతి డా. పులాల చంద్రశేఖర్ గవర్నర్కు అందజేశారు.
స్నాతకోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో గవర్నర్ అందించిన మార్గదర్శకత్వం, సహకారం, ప్రోత్సాహానికి విశ్వవిద్యాలయం తరఫున ఉపకులపతి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, డా. ఎన్టీఆర్ యూనివర్సిటీ వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య శాస్త్రాల అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే నిబద్ధతతో వైద్య విద్యా రంగానికి, ప్రజారోగ్య సేవలకు విశ్వవిద్యాలయం మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ భేటీలో విశ్వవిద్యాలయం చేపడుతున్న విద్యా, పరిశోధన కార్యక్రమాలపై కూడా చర్చ జరిగినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







