చెన్నైకి చెందిన దిలీపన్ జాతీయ జెండాను తగలబెట్టాడు!
- January 31, 2016
చెన్నైలో ఇటీవల జరిగిన వైద్య విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ ఓ యువకుడు గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండాను తగలబెట్టాడు. అంతటితో ఆగకుండా ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. చెన్నైకి చెందిన దిలీపన్ అనే యువకుడు మెడికోలు, హైదరాబాద్లో రోహిత్ వేముల ఆత్మహత్యల విషయంలో వెంటనే చర్య తీసుకోవాలంటూ జాతీయ జెండాను తగలబెట్టాడు. ఈ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఓ ప్రైవేట్ ఎయిర్లైన్స్ పైలట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దిలీపన్ పోస్ట్ చేసిన ఫొటోలు తొలగించాడు. పోలీసులు అతని కోసం గాలించి చివరికి అరెస్ట్ చేశారు. తమిళ జాతీయవాది అయిన దిలీపన్ అరెస్ట్ మరో ఆందోళనకు తెరతీసింది. కొందరు అతని అరెస్టును వ్యతిరేకిస్తూ జాతీయ జెండాను అవమానపరిచినప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. మరో పక్క అతని మీద ఫిర్యాదు చేసినవాళ్లేమో కఠిన చర్యలు తీసుకోవాలని, ఇకముందు ఎవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







